ఆధ్యాత్మికత అద్భుతాలు చేయగలదు. చాలా మంది మనసులకు అంతు చిక్కని ప్రశ్నలకు తుది సమాధానం ఆధ్యాత్మికతే. అందులోని గొప్పతనాన్ని అందరికీ పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇస్కాన్.
భారత్లో ఇస్కాన్కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటి ఇస్కాన్ స్థాపనలో ఒకరైన హెన్రీ ఫోర్డ్ మనువడు ఆల్ఫ్రెడ్ బ్రష్ ఫోర్డ్. 1974లో ఆయనకు కృష్ణతత్వం అంటే ఏంటో తెలిసింది. ఆ తర్వాత ఆయన భక్తివేదాంత స్వామి శిష్యుడయ్యారు. తర్వాత హరే కృష్ణ మూమెంట్లో భాగస్వామి అయ్యారు. అలా అల్ఫ్రెడ్ బ్రష్ ఫోర్డ్... అంబరీశ్ దాస్గా మారారు. కృష్ణతత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాయపూర్ ఇస్కాన్కు వచ్చిన అంబరీశ్ దాస్ను ఈటీవీ భారత్ పలకరించింది.
ప్ర: ఇస్కాన్కు ఎలా ఆకర్షితులయ్యారు? మీ పేరు, మతం మార్చుకునేలా ఎలా ప్రభావితం అయ్యారు?
జ: కళాశాలలో చదువుకునే రోజుల్లో చాలా ప్రశ్నలు నా మెదడును తొలిచేవి. దేవుడు, విశ్వం గురించి తెలుసుకోవాలని ఉండేది. అప్పటి నుంచి పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలో కృష్ణ భగవానుడి గురించి తెలుసుకున్నాను. ప్రభావితం అయ్యాను. కృష్ణుడు భగవంతుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి.
ప్ర: మీతో పాటు మీ కుటుంబ సభ్యులూ కృష్ణుడ్ని ప్రార్థిస్తారు. మీరు వారిని కోరారా లేక ఇది వారి సొంత నిర్ణయమా?
జ: నా భార్య వైష్ణవ మతస్థురాలు. కుటుంబం మొత్తం ఇస్కాన్కు, సనాతన ధర్మానికి అంకితం అయ్యాము.
ప్ర: భారత దేశం గురించి మీ అభిప్రాయం ఏంటి?
జ: భారత్ గొప్ప ఆధ్యాత్మిక దేశం.
ప్ర: ఆధ్యాత్మికత అన్ని సమస్యలకు సమాధానం అంటారా?
జ: ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఇందులో వాదనలు, వివాదాలు సాధారణం. ప్రస్తుత మానవుడు సాధారణ జీవితాన్ని వదిలేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత పూర్తి పరిష్కారం అవుతుందని అనలేం.
ప్ర: భారతీయులకు మీరిచ్చే సందేశం ఏంటి?
జ: ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆధ్యాత్మిక మూలాలను మరువకూడదు. వాటిని కొనసాగించాలి.