ETV Bharat / bharat-news

రాజీ వైపు సుప్రీం చూపు

అయోధ్య వివాదం పరిష్కారానికి రాజీనే ఉత్తమ మార్గమని సంకేతాలిచ్చింది సుప్రీంకోర్టు. తుది నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేసింది.

author img

By

Published : Feb 26, 2019, 2:57 PM IST

Updated : Feb 26, 2019, 3:42 PM IST

అయోధ్య వివాదం- సుప్రీంకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రాధాన్యాంశమైన అయోధ్య కేసును రాజీ ద్వారా పరిష్కరించాలని చూస్తోంది సుప్రీంకోర్టు. ఇందుకోసం మధ్యవర్తిని నియమించే అవకాశంపై ఆలోచిస్తోంది. మధ్యవర్తి నియామకంపై మార్చి 5న తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కేసు విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.

అయోధ్య కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటే ఆ దిశగా ప్రయత్నిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రాజీకి ఒక్క శాతం అవకాశం ఉన్నా... మధ్యవర్తిని వెంటనే నియమిస్తామని ప్రకటించింది.

భిన్నాభిప్రాయాలు

మధ్యవర్తి నియామకానికి కొన్ని ముస్లిం సంఘాలు అంగీకారం తెలిపాయి. హిందూ సంస్థలు ముఖ్యంగా రామ్​లల్లా విరాజ్​మాన్​ వంటివి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో చాలా సార్లు మధ్యవర్తిత్వం విఫలమైందని గుర్తు చేసింది రామ్​లల్లా. అయితే కోర్టు మాత్రం వివాదం కన్నా సంబంధాల పునరుద్ధరణే లక్ష్యమని ప్రకటించింది.

"మాకు భూమి విషయంలో ఆందోళన లేదు. పరస్పర సంబంధాలు బాగుండాలనే మా ఆలోచన. నివేదికలకు సంబంధించి అన్ని పక్షాలకు అనువాద ప్రతులకు అనుమతిస్తున్నాం. వాటిపై మీ అభిప్రాయాలను తెలపండి."
-సుప్రీం ధర్మాసనం

అనువాద ప్రతుల వితరణ

కేసుకు సంబంధించిన నివేదికల అనువాద ప్రతులను అన్ని పక్షాలకు అందివ్వాలని రిజిస్ట్రీని సుప్రీం ఆదేశించింది. దీనిపై 8 వారాల్లోగా అభిప్రాయాలను తెలపాలని సూచించింది. విచారణ ప్రారంభమయ్యాక అభిప్రాయాలను స్వీకరించమని స్పష్టంచేసింది.

2017 డిసెంబర్​లోనే అనువాద ప్రతులకు అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయని హిందుత్వ సంస్థలు తెలిపాయి. ఇదే విషయమై అభిప్రాయం తెలిపేందుకు ముస్లిం పక్షాలు రెండు నుంచి మూడు నెల సమయం కావాలని కోరాయి.

undefined

ఇదీ వివాదం

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

రాజీ వైపు సుప్రీం చూపు

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రాధాన్యాంశమైన అయోధ్య కేసును రాజీ ద్వారా పరిష్కరించాలని చూస్తోంది సుప్రీంకోర్టు. ఇందుకోసం మధ్యవర్తిని నియమించే అవకాశంపై ఆలోచిస్తోంది. మధ్యవర్తి నియామకంపై మార్చి 5న తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కేసు విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.

అయోధ్య కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటే ఆ దిశగా ప్రయత్నిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రాజీకి ఒక్క శాతం అవకాశం ఉన్నా... మధ్యవర్తిని వెంటనే నియమిస్తామని ప్రకటించింది.

భిన్నాభిప్రాయాలు

మధ్యవర్తి నియామకానికి కొన్ని ముస్లిం సంఘాలు అంగీకారం తెలిపాయి. హిందూ సంస్థలు ముఖ్యంగా రామ్​లల్లా విరాజ్​మాన్​ వంటివి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో చాలా సార్లు మధ్యవర్తిత్వం విఫలమైందని గుర్తు చేసింది రామ్​లల్లా. అయితే కోర్టు మాత్రం వివాదం కన్నా సంబంధాల పునరుద్ధరణే లక్ష్యమని ప్రకటించింది.

"మాకు భూమి విషయంలో ఆందోళన లేదు. పరస్పర సంబంధాలు బాగుండాలనే మా ఆలోచన. నివేదికలకు సంబంధించి అన్ని పక్షాలకు అనువాద ప్రతులకు అనుమతిస్తున్నాం. వాటిపై మీ అభిప్రాయాలను తెలపండి."
-సుప్రీం ధర్మాసనం

అనువాద ప్రతుల వితరణ

కేసుకు సంబంధించిన నివేదికల అనువాద ప్రతులను అన్ని పక్షాలకు అందివ్వాలని రిజిస్ట్రీని సుప్రీం ఆదేశించింది. దీనిపై 8 వారాల్లోగా అభిప్రాయాలను తెలపాలని సూచించింది. విచారణ ప్రారంభమయ్యాక అభిప్రాయాలను స్వీకరించమని స్పష్టంచేసింది.

2017 డిసెంబర్​లోనే అనువాద ప్రతులకు అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయని హిందుత్వ సంస్థలు తెలిపాయి. ఇదే విషయమై అభిప్రాయం తెలిపేందుకు ముస్లిం పక్షాలు రెండు నుంచి మూడు నెల సమయం కావాలని కోరాయి.

undefined

ఇదీ వివాదం

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

AP Video Delivery Log - 0500 GMT News
Tuesday, 26 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0434: Vietnam Summit Kim Hotel AP Clients Only 4198081
Crowds line streets as Kim convoy arrives at hotel
AP-APTN-0424: Colombia Lima Group AP Clients Only 4198073
Lima Group sends strongly worded warning to Maduro
AP-APTN-0415: Internet Trump Abortion AP Clients Only 4198080
Trump slams Senate Democrats over abortion vote
AP-APTN-0415: Vietnam Summit Kim Motorcade 2 AP Clients Only 4198079
Kim motorcade arrives on outskirts of Hanoi
AP-APTN-0352: South Korea North Korea Protest AP Clients Only 4198078
Seoul protesters urge Trump to discuss human rights
AP-APTN-0347: Vietnam Summit Pompeo AP Clients Only 4198077
US Secretary of State Pompeo arrives in Hanoi
AP-APTN-0345: Brazil Fire Museum AP Clients Only 4198076
Exhibit of Rio museum artefacts that survived fire
AP-APTN-0320: Vietnam Summit Kim Arrival No access Vietnam 4198075
Vietnam TV cover of Kim arriving at border station
AP-APTN-0305: Vietnam Summit Entrepreneurs AP Clients Only 4198074
Kim-Trump summit inspires entrepreneurs in Hanoi
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 26, 2019, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.