ETV Bharat / bharat-news

ఉగ్రనేతకు చైనా అండ

జైషే మహ్మద్​(జెమ్​) సంస్థ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్​ చేసిన విజ్ఞప్తిని మరోమారు చైనా తిరస్కరించింది.

author img

By

Published : Feb 15, 2019, 5:46 PM IST

జైషే మహ్మద్​(జెమ్​) సంస్థ అధినేత మసూద్​ అజర్​

పుల్వామా ఉగ్రదాడిపై చైనా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కానీ ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్థాన్​ ఆధారిత తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత వినతిని మాత్రం మరోమారు తోసిపుచ్చింది.

1267 భద్రతా మండలి​ కమిటీ ద్వారా అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్​, అమెరికా, యూకే, ఫ్రాన్స్​ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం కలిగిన సభ్యుల్లో చైనా ఒకటి. అలాగే పాకిస్థాన్​తో మంచి సంబంధం కలిగి ఉంది. భారత డిమాండ్​ను నేరుగా తిరస్కరించకుండా... దొడ్డిదారి అనుసరించింది చైనా. జైషే మహ్మద్​ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఉందంటూ అజర్​పై చర్యల ప్రతిపాదనను తోసిపుచ్చింది.

"తీవ్రవాద దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఉగ్రవాద సంస్థల జాబితాపై 1267 భద్రతా మండలి​ కమిటీలో తీవ్రవాద సంస్థలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జెమ్​ తీవ్రవాద ఆంక్షల జాబితాలో ఉంది. నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పద్ధతిలో ఆంక్షలను చైనా కొనసాగిస్తుంది. " - జెంగ్​ షుయాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తే ప్రంపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేయటంపై నిషేధం ఉంటుంది. అతని ఆస్తులను స్తంభింపజేస్తారు.

పుల్వామా ఉగ్రదాడిపై చైనా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కానీ ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్థాన్​ ఆధారిత తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత వినతిని మాత్రం మరోమారు తోసిపుచ్చింది.

1267 భద్రతా మండలి​ కమిటీ ద్వారా అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్​, అమెరికా, యూకే, ఫ్రాన్స్​ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం కలిగిన సభ్యుల్లో చైనా ఒకటి. అలాగే పాకిస్థాన్​తో మంచి సంబంధం కలిగి ఉంది. భారత డిమాండ్​ను నేరుగా తిరస్కరించకుండా... దొడ్డిదారి అనుసరించింది చైనా. జైషే మహ్మద్​ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఉందంటూ అజర్​పై చర్యల ప్రతిపాదనను తోసిపుచ్చింది.

"తీవ్రవాద దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఉగ్రవాద సంస్థల జాబితాపై 1267 భద్రతా మండలి​ కమిటీలో తీవ్రవాద సంస్థలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జెమ్​ తీవ్రవాద ఆంక్షల జాబితాలో ఉంది. నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పద్ధతిలో ఆంక్షలను చైనా కొనసాగిస్తుంది. " - జెంగ్​ షుయాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తే ప్రంపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేయటంపై నిషేధం ఉంటుంది. అతని ఆస్తులను స్తంభింపజేస్తారు.

New Delhi, Feb 15 (ANI): While speaking to ANI on Pulwama terror attack that took place on Thursday, General Secretary of the Bharatiya Janata Party (BJP) Ram Madhav said, "Withdrawal of the 'Most Favoured Nation' status to Pakistan was an important tactical step by government. Ministry of External Affairs will undertake major diplomatic initiatives to ensure that Pakistan is brought to justice."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.