ETV Bharat / bharat-news

మధ్యంతర బడ్జెట్​కు పార్లమెంట్​ ఆమోదం

author img

By

Published : Feb 13, 2019, 3:27 PM IST

2019-20 మధ్యంతర బడ్జెట్​, ఆర్థిక బిల్లులను పార్లమెంట్​ ఆమోదించింది.

భారత పార్లమెంట్​ భవనం

భారత పార్లమెంట్​ భవనం
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్​కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్​ సమావేశాల చివరి రోజున ఎటువంటి చర్చ లేకుండానే 2019-20 మధ్యంతర బడ్జెట్, ఆర్థిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపటంతో బిల్లు పాసైనట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
undefined

ఇప్పటికే లోక్​సభలో మధ్యంతర బడ్జెట్​, ఆర్థిక బిల్లు, కేటాయింపు బిల్లులు ఆమోదం పొందాయి. దీంతో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్​ ప్రతాప్​ శుక్లా ఈ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టారు. ముందుగా చర్చించి నిర్ణయించిన మేరకు రాజ్యసభ ఛైర్మన్ ​వెంకయ్యనాయుడు మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

పార్లమెంట్​ వ్యవహారాల మంత్రి విజయ్​ గోయల్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ప్రసంగానికీ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాల సవరణలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ధన్యవాద తీర్మానం సైతం ఆమోదం పొందినట్లు వెంకయ్య ప్రకటించారు.

బడ్జెట్​ ఆమోదంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలకు మార్గం సుగమమైంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారి ఆదాయ పన్ను రిబేటు కల్పించడం, చిన్న, సన్నకారు రైతులకు 'పీఎమ్​ సమ్మాన్ నిధి పథకం' ద్వారా సంవత్సరానికి రూ.6 వేలు పంట పెట్టుబడి సాయం, అసంఘటిత రంగ కార్మికులకు రూ.6వేలు పెన్షన్​ అందించే పథకాలు అమలుకు అవకాశం కలిగింది.

రఫేల్ ఒప్పందం, పౌరసత్వం బిల్లులపై ప్రతిపక్షాల నిరసనలతో 13 రోజుల బడ్జెట్​ సమావేశాలు ఎలాంటి చర్చలు జరగకుండానే ముగిసిపోయాయి.

భారత పార్లమెంట్​ భవనం
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్​కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్​ సమావేశాల చివరి రోజున ఎటువంటి చర్చ లేకుండానే 2019-20 మధ్యంతర బడ్జెట్, ఆర్థిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపటంతో బిల్లు పాసైనట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
undefined

ఇప్పటికే లోక్​సభలో మధ్యంతర బడ్జెట్​, ఆర్థిక బిల్లు, కేటాయింపు బిల్లులు ఆమోదం పొందాయి. దీంతో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్​ ప్రతాప్​ శుక్లా ఈ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టారు. ముందుగా చర్చించి నిర్ణయించిన మేరకు రాజ్యసభ ఛైర్మన్ ​వెంకయ్యనాయుడు మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

పార్లమెంట్​ వ్యవహారాల మంత్రి విజయ్​ గోయల్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ప్రసంగానికీ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాల సవరణలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ధన్యవాద తీర్మానం సైతం ఆమోదం పొందినట్లు వెంకయ్య ప్రకటించారు.

బడ్జెట్​ ఆమోదంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలకు మార్గం సుగమమైంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారి ఆదాయ పన్ను రిబేటు కల్పించడం, చిన్న, సన్నకారు రైతులకు 'పీఎమ్​ సమ్మాన్ నిధి పథకం' ద్వారా సంవత్సరానికి రూ.6 వేలు పంట పెట్టుబడి సాయం, అసంఘటిత రంగ కార్మికులకు రూ.6వేలు పెన్షన్​ అందించే పథకాలు అమలుకు అవకాశం కలిగింది.

రఫేల్ ఒప్పందం, పౌరసత్వం బిల్లులపై ప్రతిపక్షాల నిరసనలతో 13 రోజుల బడ్జెట్​ సమావేశాలు ఎలాంటి చర్చలు జరగకుండానే ముగిసిపోయాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.