ETV Bharat / bharat-news

ఆధారాలు ఇవ్వం : భారత్​

పుల్వామా ఘటనపై పాక్​కు ఎలాంటి ఆధారాలు అందించబోమని, మిత్రదేశాలకు వాటి సమాచారం అందించి పాకిస్థాన్​ బండారం బయటపెడతామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

author img

By

Published : Feb 21, 2019, 5:53 AM IST

Updated : Feb 21, 2019, 7:16 AM IST

పుల్వామా ఘటనపై పాక్​కు ఆధారాల సమర్పణ ఉండదని భారత్​ స్పష్టం

పుల్వామా ఉగ్రదాడిలో 'జైషే మహ్మద్'​ పాత్రపై పాకిస్థాన్​కు ఎలాంటి ఆధారాలు భారత్​ అందించదని ఓ ప్రభుత్వ అధికారి అధికారికంగా తెలిపారు. అయితే పాక్​ అసలు రంగు బయటపెట్టడానికి మిత్రదేశాలకు ఆ ఆధారాలు సమర్పిస్తామని ఆయన అన్నారు. గతంలో 26/11 ముంబయి ఉగ్రదాడి, పఠాన్​కోట్​ వైమానిక స్థావరం దాడుల వివరాలు పాక్​కు సమర్పించామని తెలిపారు. ఆయితే ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిపై దాయాది దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. అందుకే పాకిస్థాన్​కు ఆధారాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకు ఆధారాలు చూపించి పాక్​ బండారం బయటపెడతామన్నారు.

ఓ అవకాశం ఇచ్చి చూద్దాం....

పుల్వామా దాడిపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ స్పందించారు. ఉగ్రదాడిపై గత పాక్​ ప్రభుత్వాలు సాక్ష్యాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్​ ఖాన్​ కొత్త ప్రధాని కనుక అవకాశం ఇచ్చి చూద్దామని అభిప్రాయపడ్డారు.

"ఈ రోజుల్లో నిరక్షరాస్యులే యుద్ధం గురించి మాట్లాడుతారు. మన రెండు దేశాలు అణు సామర్థ్యం కలవి. చర్చించుకునే అవకాశం ఉన్నప్పుడు యుద్ధమనే ప్రశ్నే వద్దు."_ మెహబూబా ముఫ్తీ, జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి

పుల్వామా ఉగ్రదాడిలో 'జైషే మహ్మద్'​ పాత్రపై పాకిస్థాన్​కు ఎలాంటి ఆధారాలు భారత్​ అందించదని ఓ ప్రభుత్వ అధికారి అధికారికంగా తెలిపారు. అయితే పాక్​ అసలు రంగు బయటపెట్టడానికి మిత్రదేశాలకు ఆ ఆధారాలు సమర్పిస్తామని ఆయన అన్నారు. గతంలో 26/11 ముంబయి ఉగ్రదాడి, పఠాన్​కోట్​ వైమానిక స్థావరం దాడుల వివరాలు పాక్​కు సమర్పించామని తెలిపారు. ఆయితే ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిపై దాయాది దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. అందుకే పాకిస్థాన్​కు ఆధారాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకు ఆధారాలు చూపించి పాక్​ బండారం బయటపెడతామన్నారు.

ఓ అవకాశం ఇచ్చి చూద్దాం....

పుల్వామా దాడిపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ స్పందించారు. ఉగ్రదాడిపై గత పాక్​ ప్రభుత్వాలు సాక్ష్యాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్​ ఖాన్​ కొత్త ప్రధాని కనుక అవకాశం ఇచ్చి చూద్దామని అభిప్రాయపడ్డారు.

"ఈ రోజుల్లో నిరక్షరాస్యులే యుద్ధం గురించి మాట్లాడుతారు. మన రెండు దేశాలు అణు సామర్థ్యం కలవి. చర్చించుకునే అవకాశం ఉన్నప్పుడు యుద్ధమనే ప్రశ్నే వద్దు."_ మెహబూబా ముఫ్తీ, జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి


New Delhi, Feb 20 (ANI): Saudi Arabia Crown Prince Mohammed bin Salman and Indian Prime Minister Narendra Modi issued a joint statement and exchanged various agreements in Delhi today. Later, PM Narendra Modi said, "Saudi Arabia is one of India's most valuable strategic partners. Our relations have grown stronger. I welcome Saudi investment in Indian infrastructure. We welcome Saudi Arabia joining the International Solar Alliance. We also discussed how to further strengthen our defence cooperation." "We agreed that there is a need to increase pressure on the countries which support terrorism," PM added.

Last Updated : Feb 21, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.