ETV Bharat / bharat-news

కొరియాతో 7 ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏడు కీలక ఆంశాలపై ఒప్పందాలు కుదిరాయి.

author img

By

Published : Feb 22, 2019, 4:35 PM IST

Updated : Feb 22, 2019, 5:10 PM IST

కొరియాతో ఏడు ఒప్పందాలు

దక్షిణ కొరియాలో రెండు రోజులు పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్​-దక్షిణ కొరియా మధ్య ఏడు కీలక ఒప్పందాలు జరిగాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మీడియా, అంకుర పరిశ్రమలు, సరిహద్దు, అంతర్జాతీయ నేరాల విచారణలో సహకారం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో ప్రధాని మోదీ చర్చించారు. అనంతరం కొరియన్​ నేషనల్​ పాలసీ ఏజెన్సీ, భారత హోంశాఖ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

రాజకుమారిపై పోస్టల్​ స్టాంప్​

కొరియన్​ రాజు కిమ్​ సురోను పెళ్లి చేసుకున్న అయోధ్య రాజకుమారి సురిరత్నా జ్ఞాపకార్థం ఇరుదేశాలు సంయుక్తంగా పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.

పెట్టుబడులు

భారత్​లోని కొరియన్​ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ప్లస్​ సంస్థకు వీలుకల్పించారు. అంకుర పరిశ్రమల అభివృద్ధికి భారత్​లో కొరియా స్టార్టప్​ సెంటర్​ (కేఎస్​సీ)ను ఏర్పాటు చేయనున్నారు.

టీవీ ప్రసారాలకు అనుమతి

దక్షిణ కొరియాలో డీడీ ఇండియా, భారత్​లో కేబీఎస్​ వరల్డ్​ ఛానళ్ల ప్రసారానికి కొరియన్​ బ్రాడ్​కాస్టింగ్​ సిస్టమ్​, ప్రసార భారతి మధ్య ఒప్పందం కుదిరింది.

రహదారుల అభివృద్ధి

భారత జాతీయ రహదారుల సంస్థ, కొరియన్​ ఎక్స్​ప్రెస్​వే కార్పొరేషన్​ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రహదారులు, రవాణా విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇరుదేశాలు సహకరించుకోనున్నాయి.

దక్షిణ కొరియాలో రెండు రోజులు పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్​-దక్షిణ కొరియా మధ్య ఏడు కీలక ఒప్పందాలు జరిగాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మీడియా, అంకుర పరిశ్రమలు, సరిహద్దు, అంతర్జాతీయ నేరాల విచారణలో సహకారం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో ప్రధాని మోదీ చర్చించారు. అనంతరం కొరియన్​ నేషనల్​ పాలసీ ఏజెన్సీ, భారత హోంశాఖ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

రాజకుమారిపై పోస్టల్​ స్టాంప్​

కొరియన్​ రాజు కిమ్​ సురోను పెళ్లి చేసుకున్న అయోధ్య రాజకుమారి సురిరత్నా జ్ఞాపకార్థం ఇరుదేశాలు సంయుక్తంగా పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నాయి.

పెట్టుబడులు

భారత్​లోని కొరియన్​ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ప్లస్​ సంస్థకు వీలుకల్పించారు. అంకుర పరిశ్రమల అభివృద్ధికి భారత్​లో కొరియా స్టార్టప్​ సెంటర్​ (కేఎస్​సీ)ను ఏర్పాటు చేయనున్నారు.

టీవీ ప్రసారాలకు అనుమతి

దక్షిణ కొరియాలో డీడీ ఇండియా, భారత్​లో కేబీఎస్​ వరల్డ్​ ఛానళ్ల ప్రసారానికి కొరియన్​ బ్రాడ్​కాస్టింగ్​ సిస్టమ్​, ప్రసార భారతి మధ్య ఒప్పందం కుదిరింది.

రహదారుల అభివృద్ధి

భారత జాతీయ రహదారుల సంస్థ, కొరియన్​ ఎక్స్​ప్రెస్​వే కార్పొరేషన్​ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రహదారులు, రవాణా విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇరుదేశాలు సహకరించుకోనున్నాయి.


Seoul (South Korea), Feb 22 (ANI): Prime Minister Narendra Modi on Friday underscored the defence relations between India and South Korea by giving the example of K-9 Vajra artillery, a South Korea-made gun being a part of Indian Army's arsenal. "Defence sector is an important part of our growing partnership with South Korea. An example of this is the induction of K-9 Vajra artillery gun in Indian Army," PM Modi said in a joint statement in Seoul. PM Modi added that both the countries have agreed to prepare a roadmap in order to enhance cooperation in defence technology.
Last Updated : Feb 22, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.