ETV Bharat / bharat-news

"దాడులను తిప్పికొట్టండి"

భారత్​ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, దాడి చేసినా దీటుగా, సమగ్రంగా బదులివ్వాలని పాకిస్థాన్ సైన్యాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ఆదేశించారు.

author img

By

Published : Feb 22, 2019, 7:36 AM IST

ఇమ్రాన్​ఖాన్​, పాక్​ ప్రధాని

పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ఖాన్​ అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి సమావేశమైంది. భారత్​ పాక్​పై దాడి చేస్తే పూర్తిస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని​ ఆ దేశ సైన్యాన్ని ఇమ్రాన్​ ఆదేశించారు.

"భారత్ దాడులను తిప్పికొట్టండి": ఇమ్రాన్​ఖాన్​

పాక్ ఆధారిత 'జైష్​ ఏ మహమ్మద్​' జరిపిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్​ జవానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్​ ఉగ్ర చర్యపై ప్రతీకారం తీర్పుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రతిచర్యగా గురువారం పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​, జాతీయ భద్రతా మండలి (ఎన్​ఎస్​సీ)తో సమావేశమయ్యారు. సైన్యాధిపతి జైన్ ఖమర్​ జావెద్​తో ఇమ్రాన్​ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పాక్​ ప్రభుత్వానికి తమ ప్రజలను సంరక్షించుకునే శక్తి ఉందని, అందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

"ఇది నూతన పాకిస్థాన్​. మా ప్రజలను సంరక్షించుకునే సామర్థ్యం మాకుంది. ఇదే మా ప్రజలకు మేమిచ్చే భరోసా" - ఇమ్రాన్​ఖాన్​, పాక్​ ప్రధాని

చెప్పకనే చెప్పిన ఇమ్రాన్​...

పాక్​లో తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని పాక్​ హోంశాఖను, భద్రతా సంస్థలను ఇమ్రాన్​ ఆదేశించారు. దీంతో పాక్​లో ఉగ్రవాద బీజాలు ఉన్నాయని ఇమ్రాన్ చెప్పకనే చెప్పినట్లైంది.

పుల్వామా దాడిలో పాక్​ ప్రమేయం లేదని ఇమ్రాన్​ పునరుద్ఘాటించారు. ఈ దాడి ప్రణాళిక, అమలుతో పాక్​కు సంబంధం లేదని ఆయన చెప్పారు. కశ్మీర్​ సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు తమ వంతు సహకారం అందించాలని ఇమ్రాన్​ కోరారు.

పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ఖాన్​ అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి సమావేశమైంది. భారత్​ పాక్​పై దాడి చేస్తే పూర్తిస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని​ ఆ దేశ సైన్యాన్ని ఇమ్రాన్​ ఆదేశించారు.

"భారత్ దాడులను తిప్పికొట్టండి": ఇమ్రాన్​ఖాన్​

పాక్ ఆధారిత 'జైష్​ ఏ మహమ్మద్​' జరిపిన పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్​ జవానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్​ ఉగ్ర చర్యపై ప్రతీకారం తీర్పుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రతిచర్యగా గురువారం పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​, జాతీయ భద్రతా మండలి (ఎన్​ఎస్​సీ)తో సమావేశమయ్యారు. సైన్యాధిపతి జైన్ ఖమర్​ జావెద్​తో ఇమ్రాన్​ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పాక్​ ప్రభుత్వానికి తమ ప్రజలను సంరక్షించుకునే శక్తి ఉందని, అందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

"ఇది నూతన పాకిస్థాన్​. మా ప్రజలను సంరక్షించుకునే సామర్థ్యం మాకుంది. ఇదే మా ప్రజలకు మేమిచ్చే భరోసా" - ఇమ్రాన్​ఖాన్​, పాక్​ ప్రధాని

చెప్పకనే చెప్పిన ఇమ్రాన్​...

పాక్​లో తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని పాక్​ హోంశాఖను, భద్రతా సంస్థలను ఇమ్రాన్​ ఆదేశించారు. దీంతో పాక్​లో ఉగ్రవాద బీజాలు ఉన్నాయని ఇమ్రాన్ చెప్పకనే చెప్పినట్లైంది.

పుల్వామా దాడిలో పాక్​ ప్రమేయం లేదని ఇమ్రాన్​ పునరుద్ఘాటించారు. ఈ దాడి ప్రణాళిక, అమలుతో పాక్​కు సంబంధం లేదని ఆయన చెప్పారు. కశ్మీర్​ సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు తమ వంతు సహకారం అందించాలని ఇమ్రాన్​ కోరారు.


Bareilly (Uttar Pradesh), Feb 22 (ANI): Ever since the Pulwama terror attack took place in Jammu and Kashmir where more than 40 CRPF personnel were killed, support for the families of martyrs is pouring from all over the country. Now in a similar gesture, Kiran Jhagwal who is principal of a private school in Bareilly sold her bangles and donated Rs 1.3 lakh to the Prime Minister Relief Fund for the families of martyred CRPF personnel. Jhagwal said she thought of selling her bangles when she saw the spouses of slain soldiers crying on television, and urged citizens of the country to donate in whatever way they can. "When I saw the wives crying I thought what I can do for them, I sold my bangles and donated money to PM Relief Fund. The bangles were gifted by my father. People must come forward. We're a population of 130 Cr, if everyone donates even Re 1 each a lot can be collected," Jhagwal told ANI.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.