జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఫైరింగ్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మీమేందార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సైనికులు తనిఖీలు చేపట్టారు. భారత బలగాల ఉగ్రవేటతో అప్రమత్తమైన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
జైషే మహమ్మద్ ఉగ్రమూకల శిబిరాలపై భారత్ వైమానిక దళం మంగళవారం బాంబుల దాడి చేసింది. నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలోని బాలాకోట్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. సైనిక దాడిలో చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలొస్తున్నా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత భారత వైమానిక దళం నియంత్రణ రేఖ దాటి దాడి చేయడం ఇదే తొలిసారి.