ETV Bharat / bharat-news

'దాడికి పాక్​ విఫలయత్నం'

పాకిస్థాన్​ వాయుసేనకు చెందిన ఎఫ్​-16 జెట్​ విమానాలు ఉదయం భారత గగనతలంలోకి చొరబడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటన చేశారు.

author img

By

Published : Feb 27, 2019, 3:37 PM IST

Updated : Feb 27, 2019, 4:39 PM IST

పైలట్​ గల్లంతు నిజమే

భారత సైనిక శిబిరాలపై దాడికి పాకిస్థాన్​ వాయుసేన యత్నించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటించారు. దాయాది దేశ ప్రయత్నాలను భారత్ సమర్థంగా​ తిప్పికొట్టిందని​ స్పష్టం చేశారు.

"భారత్​ చేసిన ఉగ్రవాద వ్యతిరేక మెరుపుదాడులకు ఈ రోజు ఉదయం పాక్​ స్పందించింది. భారత శిబిరాలపై తన వాయుసేనతో దాడికి యత్నించింది. మనం అప్రమత్తంగా వ్యవహరించి పాకిస్థాన్​ చర్యలను తిప్పికొట్టాం. పాక్​ విమానాలను గుర్తించిన భారత వాయుసేన వెంటనే స్పందించింది. ఈ ఘటనలో ఒక పాక్​ ఫైటర్​జెట్​ను మిగ్​-21 బైసన్​ కూల్చింది. కూలిన విమానం పాక్​ వైపు పడటాన్ని మన సిబ్బంది గమనించారు."
---- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.

పాక్​ వాయుసేనతో జరిగిన పోరులో భారత్​ ఒక మిగ్​-21 విమానాన్ని కోల్పోయిందని ధృవీకరించారు రవీశ్​.

మిగ్​-21లో అభినందన్​​...

మిగ్​-21ను నడిపింది ఐఏఎఫ్​ పైలట్​ అభినందన్​. అయన ఆచూకీపై ఎటువంటి సమాచారం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పైలట్​ తమ ఆధీనంలో ఉన్నాడని పాక్​ ప్రకటించిన కొద్ది గంటలకు విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. పాక్​ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రవీశ్ వెల్లడించారు.​

"ఈ పూర్తి వ్యవహారంలో దురదృష్టవశాత్తు ఒక మిగ్​-21 విమానాన్ని కోల్పోయాం. పైలట్​ కనపడట్లేదు. పైలట్​ తమ కస్టడీలోనే ఉన్నట్టు పాక్​ ప్రకటించింది."
---- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి

కళ్లకు గంతలు కట్టిన ఓ మనిషి దృశ్యాలను పాకిస్థాన్​ సైన్యం విడుదల చేసింది. అతడే అభినందన్​ అని పాక్​ చెబుతోంది. అయితే ఆ ప్రకటనలోని నిజానిజాలు తేలాల్సి ఉందని రవీశ్​ చెప్పారు.

undefined

రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

భారత సైనిక శిబిరాలపై దాడికి పాకిస్థాన్​ వాయుసేన యత్నించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ప్రకటించారు. దాయాది దేశ ప్రయత్నాలను భారత్ సమర్థంగా​ తిప్పికొట్టిందని​ స్పష్టం చేశారు.

"భారత్​ చేసిన ఉగ్రవాద వ్యతిరేక మెరుపుదాడులకు ఈ రోజు ఉదయం పాక్​ స్పందించింది. భారత శిబిరాలపై తన వాయుసేనతో దాడికి యత్నించింది. మనం అప్రమత్తంగా వ్యవహరించి పాకిస్థాన్​ చర్యలను తిప్పికొట్టాం. పాక్​ విమానాలను గుర్తించిన భారత వాయుసేన వెంటనే స్పందించింది. ఈ ఘటనలో ఒక పాక్​ ఫైటర్​జెట్​ను మిగ్​-21 బైసన్​ కూల్చింది. కూలిన విమానం పాక్​ వైపు పడటాన్ని మన సిబ్బంది గమనించారు."
---- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి.

పాక్​ వాయుసేనతో జరిగిన పోరులో భారత్​ ఒక మిగ్​-21 విమానాన్ని కోల్పోయిందని ధృవీకరించారు రవీశ్​.

మిగ్​-21లో అభినందన్​​...

మిగ్​-21ను నడిపింది ఐఏఎఫ్​ పైలట్​ అభినందన్​. అయన ఆచూకీపై ఎటువంటి సమాచారం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పైలట్​ తమ ఆధీనంలో ఉన్నాడని పాక్​ ప్రకటించిన కొద్ది గంటలకు విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. పాక్​ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రవీశ్ వెల్లడించారు.​

"ఈ పూర్తి వ్యవహారంలో దురదృష్టవశాత్తు ఒక మిగ్​-21 విమానాన్ని కోల్పోయాం. పైలట్​ కనపడట్లేదు. పైలట్​ తమ కస్టడీలోనే ఉన్నట్టు పాక్​ ప్రకటించింది."
---- రవీశ్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి

కళ్లకు గంతలు కట్టిన ఓ మనిషి దృశ్యాలను పాకిస్థాన్​ సైన్యం విడుదల చేసింది. అతడే అభినందన్​ అని పాక్​ చెబుతోంది. అయితే ఆ ప్రకటనలోని నిజానిజాలు తేలాల్సి ఉందని రవీశ్​ చెప్పారు.

undefined
Intro:Body:Conclusion:
Last Updated : Feb 27, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.