ETV Bharat / bharat-news

ఐరాసకు లోబడే దాడులు

భారత వాయుసేన దాడులు ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం తప్పేమీకాదని దీనిపై ఐరాస అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని స్పష్టం చేశారు రక్షణ శాఖ నిపుణుడు రంజిత్​ రాయ్​.

author img

By

Published : Feb 26, 2019, 11:28 AM IST

రంజిత్ రాయ్

12 మిరాజ్​ జెట్​ ఫైటర్లు శక్తివంతమైన లేజర్​ సహితమైన​ 1000 కేజీల బాంబులతో పాక్​ ఆక్రమిత కశ్మీర్​ లోని బాల్​కోట్​లో జైషే మహ్మద్​ శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం అందింది. బాల్​కోట్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో మూల భాగంలో ఉంది. ఇది వాస్తవానికి భారత్​కు చెందిన ప్రాంతం. ఐక్యరాజ్య సమితి చాప్టర్​ 7 ప్రకారం స్వీయరక్షణ దాడులు నేరం కాదు . జైషే సంస్థని, మసూద్​ అజర్​ని ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించింది. వాయుసేన దాడులు సులభం కాబట్టి భారత్​ వీటిని ఎంచుకుంది. భారత వాయుసేన విమానాలు బాలకోట్​ని ధ్వంసం చేశాయి. ఎంత మేర నష్టం జరిగిందో తెలియాలి. - రంజిత్​ రాయ్​, రక్షణ రంగ నిపుణుడు

పాక్​కు అవమానకరం:ధిల్లాన్

balakot
డీఎస్ ధిల్లాన్

భారత వైమానిక దాడులపై రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్​ స్పందించారు. దాడిలో వాడిన మిరాజ్​ విమానాలు లక్ష్యాలను తప్పే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దాడి జరిగిందనేది స్పష్టం అన్నారు. 80 కిలోమీటర్ల మేర పీఓకేలో దాడులు జరిగాయన్నారు. పాకిస్థాన్​ సైతం ఇవే ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.

పాక్​కు ఇది అంతర్జాతీయంగా అవమానకర సమయమని రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్​ పేర్కొన్నారు. ఒసామా ఆపరేషన్​ తర్వాత పాక్​ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను చంపడం ఆ దేశానికి మచ్చగానే మిగులుతుందన్నారు. కార్గిల్​ సమయంలోనూ నియంత్రణ రేఖను భారత్​ దాటలేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాక్ మీడియా ప్రసారం చేస్తున్న చిత్రాల్లో నిజం లేదని ధిల్లాన్​ అన్నారు. మిరాజ్​లో ఉన్న ఆయుధ వ్యవస్థ పటినష్టమైనదనీ, గురి తప్పే అవకాశమే లేదని తెలిపారు. పూర్తి వ్యూహాత్మకంగానే భారత వైమానిక దళం దాడులు జరిపిందని స్పష్టం చేశారు.

12 మిరాజ్​ జెట్​ ఫైటర్లు శక్తివంతమైన లేజర్​ సహితమైన​ 1000 కేజీల బాంబులతో పాక్​ ఆక్రమిత కశ్మీర్​ లోని బాల్​కోట్​లో జైషే మహ్మద్​ శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం అందింది. బాల్​కోట్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో మూల భాగంలో ఉంది. ఇది వాస్తవానికి భారత్​కు చెందిన ప్రాంతం. ఐక్యరాజ్య సమితి చాప్టర్​ 7 ప్రకారం స్వీయరక్షణ దాడులు నేరం కాదు . జైషే సంస్థని, మసూద్​ అజర్​ని ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించింది. వాయుసేన దాడులు సులభం కాబట్టి భారత్​ వీటిని ఎంచుకుంది. భారత వాయుసేన విమానాలు బాలకోట్​ని ధ్వంసం చేశాయి. ఎంత మేర నష్టం జరిగిందో తెలియాలి. - రంజిత్​ రాయ్​, రక్షణ రంగ నిపుణుడు

పాక్​కు అవమానకరం:ధిల్లాన్

balakot
డీఎస్ ధిల్లాన్

భారత వైమానిక దాడులపై రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్​ స్పందించారు. దాడిలో వాడిన మిరాజ్​ విమానాలు లక్ష్యాలను తప్పే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దాడి జరిగిందనేది స్పష్టం అన్నారు. 80 కిలోమీటర్ల మేర పీఓకేలో దాడులు జరిగాయన్నారు. పాకిస్థాన్​ సైతం ఇవే ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.

పాక్​కు ఇది అంతర్జాతీయంగా అవమానకర సమయమని రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్​ పేర్కొన్నారు. ఒసామా ఆపరేషన్​ తర్వాత పాక్​ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను చంపడం ఆ దేశానికి మచ్చగానే మిగులుతుందన్నారు. కార్గిల్​ సమయంలోనూ నియంత్రణ రేఖను భారత్​ దాటలేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాక్ మీడియా ప్రసారం చేస్తున్న చిత్రాల్లో నిజం లేదని ధిల్లాన్​ అన్నారు. మిరాజ్​లో ఉన్న ఆయుధ వ్యవస్థ పటినష్టమైనదనీ, గురి తప్పే అవకాశమే లేదని తెలిపారు. పూర్తి వ్యూహాత్మకంగానే భారత వైమానిక దళం దాడులు జరిపిందని స్పష్టం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.