Botsa Fire On Contract Employees: తెలంగాణ జీఓ.. బోగస్ జీఓ అన్న మంత్రి.. కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఆగ్రహం - Botsa Satyanarayana about Contract Employees

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 16, 2023, 11:32 AM IST

Minister Botsa Satyanarayana On Contract Employees: ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ బోగస్ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కావాలంటే వెళ్లి పరిశీలించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఒప్పంద ఉద్యోగులపై మండిపడ్డారు. వివిధ జిల్లాల నుంచి పలు శాఖలకు చెందిన ఒప్పంద ఉద్యోగులు గురువారం విజయనగరం చేరుకుని మంత్రిని కలిశారు. తమను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓతో 960 మందికే ఉద్యోగాలు వచ్చాయని, ఇక్కడ పది వేల మందికి ఇస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోతే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చాక 2026లో క్రమద్దీకరిస్తామని పేర్కొన్నారు. బోదనేతర సిబ్బందికి ఈ లోపు ఉద్యోగోన్నతులు వస్తే 2026 వరకు తమ ఉద్యోగాలు ఉండవని కొందరు ఈ సందర్భంగా మంత్రి వద్ద వాపోగా.. తెలియకుండా మాట్లాడొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పంద ఉద్యోగాలు పోవు, దీనికి నేను గ్యారంటీ అని అన్నారు. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయం మేరకు చేస్తామని అన్నారు. ఈ క్రమంలో కొందరు తెలంగాణ జీఓను ప్రస్తావించగా, అది బోగస్ జీఓ అని, కావాలంటే డబ్బులిచ్చి ఇద్దరిని పంపిస్తా పరిశీలించుకోండని బొత్స సత్యనారాయణ బదులిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.