thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 9:02 PM IST

ETV Bharat / Videos

అధిష్ఠానం స్థానికతకే మొగ్గు చూపుతోంది - సీఎం నిర్ణయాన్ని శిరసావహిస్తా: బొత్స ఝాన్సీ

Botsa Jhansi Comments about Contesting as Visakhapatnam MP: ఇతరుల మాదిరిగా తాను బయట నుంచి రాలేదని విశాఖలోనే పుట్టి పెరిగానని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం స్థానికతకే మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం ప్రకారం పార్టీ మేలు కోసం ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తామని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. 

బీసీలకు, మహిళలకు పార్టీ పదవులతో పాటు, సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలోచిస్తున్నారని తెలిపారు. పార్టీకి, ప్రజలకు విస్తృత ప్రయోజనం కలుగుతుందని నమ్మకంతోనే ఏ ఆలోచనైనా చేస్తారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశాలకు శిరసా వహిస్తానని తెలిపారు. విశాఖపట్నం తన పుట్టినిల్లని, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు తమకు ఇక్కడే ఉన్నాయని, విద్యాభ్యాసం సైతం వైజాగ్​లోనే జరిగిందన్నారు. తాను పూర్తిగా స్థానికురాలినని ఝాన్సీ అన్నారు. ప్రజలంతా మళ్లీ జగనే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.