ETV Bharat / state

'విధ్వంసం అన్న పదాన్ని.. లోకేష్ సరిగ్గా పలకగలరా?' - తెదేపాపై వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ విమర్శల వార్తలు

వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెదేపా నేతలకు లేదని.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ అన్నారు. నారా లోకేశ్ మాట్లాడితే చాలు.. విధ్వంసం అంటున్నాడని.. అతడు ఆ పదాన్ని సరిగ్గా పలకగలిగితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ycp mla rachamallu sivaprasad reddy criticises tdp leaders
వైకాపా ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్ రెడ్డి
author img

By

Published : Jun 11, 2020, 8:12 PM IST

ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టిన ఘనత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డిదేన‌ని.. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివప్ర‌సాద్ రెడ్డి అన్నారు. వైకాపా తరఫున శాస‌న‌స‌భ్యునిగా కొన‌సాగుతున్నందుకు సంతోష ప‌డుతున్నాన‌ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... విధ్వంసం అనే పుస్త‌కాన్ని విడుద‌ల చేశార‌ని.. ఆయన విధ్వంసం అనే ప‌దాన్ని సరిగ్గా ప‌ల‌క‌గ‌లిగితే తాను పదవికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ చేశారు. లోకేశ్ రాజ‌కీయ బాలుడు అని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెదేపా నేతలకు లేదన్నారు.

ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టిన ఘనత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డిదేన‌ని.. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివప్ర‌సాద్ రెడ్డి అన్నారు. వైకాపా తరఫున శాస‌న‌స‌భ్యునిగా కొన‌సాగుతున్నందుకు సంతోష ప‌డుతున్నాన‌ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... విధ్వంసం అనే పుస్త‌కాన్ని విడుద‌ల చేశార‌ని.. ఆయన విధ్వంసం అనే ప‌దాన్ని సరిగ్గా ప‌ల‌క‌గ‌లిగితే తాను పదవికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ చేశారు. లోకేశ్ రాజ‌కీయ బాలుడు అని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెదేపా నేతలకు లేదన్నారు.

ఇవీ చదవండి:

కస్టడీలో దివ్య కేసు నిందితులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.