ETV Bharat / state

విసుగెత్తిన గ్రామస్థులు.. జగనన్న పాలనలో 'ప్రజా రోడ్డు' - కడప తాజా వార్తలు

పదేళ్లపాటు అధికారులు రోడ్డు నిర్మించకపోతారా అని నిరీక్షించారు. కానీ పాలకులు పట్టించుకోలేదు. ఇక వేచిచూడటం వ్యర్థమని ప్రజలే చందాలు వేసుకుని స్వయంగా రోడ్డు నిర్మించుకున్నారు. అంతేగాక 'జగనన్న పాలనలో ప్రజా రోడ్డు' అని పేరు కూడా పెట్టారు.

people  built the road
జగనన్న పాలనలో ప్రజా రోడ్డు
author img

By

Published : Dec 11, 2020, 3:29 PM IST

కడప శివారులోని రామాంజనేయపురం వద్ద సాగర్ కాలనీ, విద్యుత్ కాలనీ, ఏపీ రెసిడెన్షియల్ కాలనీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది జీవిస్తున్నారు. ఈ కాలనీలకు ఇప్పటివరకు సరైన రోడ్డు వసతి లేదు. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉంటాయి. అన్ని మట్టిరోడ్లు కావడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులు, నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక స్థానికులంతా చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు.

కడప శివారులోని రామాంజనేయపురం వద్ద సాగర్ కాలనీ, విద్యుత్ కాలనీ, ఏపీ రెసిడెన్షియల్ కాలనీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది జీవిస్తున్నారు. ఈ కాలనీలకు ఇప్పటివరకు సరైన రోడ్డు వసతి లేదు. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉంటాయి. అన్ని మట్టిరోడ్లు కావడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులు, నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక స్థానికులంతా చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండీ...అంగళ్లలో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.