ETV Bharat / state

'అపోహలు నమ్మొద్దు... ఛార్జీలు కొద్దిగానే పెరిగాయి' - రాజంపేటలో అధిక విద్యుత్ ఛార్జీలు

విద్యుత్ ఛార్జీలపై వచ్చే అపోహలు ప్రజలు నమ్మొద్దని.. కొత్త టారిఫ్ ప్రకారం బిల్లులు కొద్దిగానే పెరిగాయని కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపలేదని వివరించారు.

rajampeta deo clarifies about electricity charges
రాజంపేట విద్యుత్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ రావు
author img

By

Published : May 20, 2020, 5:02 PM IST

విద్యుత్తు చార్జీలు పెంపుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మవద్దని కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజనల్ అధికారి చంద్రశేఖరరావు అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని.. దీని ప్రకారం 500 యూనిట్లుపైన విద్యుత్ వాడిన వారికి కొద్దిగా ఛార్జీలు పెరిగాయని తెలిపారు. మిగిలిన వారందరికీ టారిఫ్​లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు.

మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీసి.. అందులో మార్చి నెలకు పాత టారీఫ్ ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు వేశామని చెప్పారు. ఇందులో ఇదివరకే చెల్లించిన మార్చి నెల బిల్లును తగ్గించామన్నారు. ప్రజలపై అదనపు భారం మోపలేదని.. ఈ ఏడాది జూన్ వరకు బిల్లు చెల్లించే వెలసుబాటు కల్పించామని వివరించారు.

విద్యుత్తు చార్జీలు పెంపుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మవద్దని కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజనల్ అధికారి చంద్రశేఖరరావు అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని.. దీని ప్రకారం 500 యూనిట్లుపైన విద్యుత్ వాడిన వారికి కొద్దిగా ఛార్జీలు పెరిగాయని తెలిపారు. మిగిలిన వారందరికీ టారిఫ్​లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు.

మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీసి.. అందులో మార్చి నెలకు పాత టారీఫ్ ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు వేశామని చెప్పారు. ఇందులో ఇదివరకే చెల్లించిన మార్చి నెల బిల్లును తగ్గించామన్నారు. ప్రజలపై అదనపు భారం మోపలేదని.. ఈ ఏడాది జూన్ వరకు బిల్లు చెల్లించే వెలసుబాటు కల్పించామని వివరించారు.

ఇవీ చదవండి.. కరోనాపై అవగాహన.. కళాకారుల నాటక ప్రదర్శన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.