పోలీసులకు చిక్కిన ద్విచక్రవాహన దొంగ ఊరూరా తిరిగి పాత్రల వ్యాపారం చేస్తూ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుణ్ని కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఫకృద్దీన్ ఊరూరా తిరిగి పాత్రలు అమ్ముతూ గ్రామాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలను దొంగలించేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 22 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు తస్కరించాడు. వరుస ఫిర్యాదులతో విచారించిన పోలీసులు.. నిఘా ఉంచి నిందితుడి ఆట కట్టించారు. అపహరించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని మైదుకూరు సీఐ మదుసూదన్ తెలిపారు. అప్పుల బాధ తట్టుకోలేకే ఫకృద్దీన్ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు.
ఇదీ చదవండి:
ప్రయాణికులే లక్ష్యం... కాపుకాసి బంగారు ఆభరణాలు మాయం