ETV Bharat / state

రాజంపేటలో ఘనంగా ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాలు - కడప జిల్లాలో ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాల న్యూస్

ఆనందోత్సాహాలు, పండగ వాతావరణం మధ్య ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాలు కడప జిల్లాలో వైభవంగా జరిగాయి. నృత్య, పాటల పోటీలతోపాటు రంగవల్లి, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో యువతీ యువకులు సత్తా చాటుకున్నారు.

NSS youth festivals in Rajampeta
రాజంపేటలో ఘనంగా ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాలు
author img

By

Published : Jan 21, 2020, 11:56 AM IST

రాజంపేటలో ఘనంగా ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాలు

కడప జిల్లా రాజంపేటలో ఎన్​ఎస్​ఎస్​ జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నృత్య, పాటల పోటీలతోపాటు రంగవల్లి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ పోటీలకు వచ్చిన యువతీ యువకులు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి... విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థిగా ఉండి... ఉన్నత చదువుల్లో రాణించినట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ భావజాలంతోనే ఉద్యోగంలో పని చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: మోపిదేవి గ్రామం... ముగ్గుమనోహరం...

రాజంపేటలో ఘనంగా ఎన్​ఎస్​ఎస్​ యువజనోత్సవాలు

కడప జిల్లా రాజంపేటలో ఎన్​ఎస్​ఎస్​ జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నృత్య, పాటల పోటీలతోపాటు రంగవల్లి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ పోటీలకు వచ్చిన యువతీ యువకులు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి... విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థిగా ఉండి... ఉన్నత చదువుల్లో రాణించినట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ భావజాలంతోనే ఉద్యోగంలో పని చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: మోపిదేవి గ్రామం... ముగ్గుమనోహరం...

Intro:Ap_cdp_46_21_VO_NSS_yuvajanostavalu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఆనందోత్సాహాలు, పండగ వాతావరణం మధ్య ఎన్ ఎస్ ఎస్ జిల్లా స్థాయి యువజనోత్సవాలు వైభవంగా జరిగాయి. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ యువజనోత్సవాలను పురస్కరించుకొని నృత్య పాటల పోటీలతో పాటు రంగవల్లి, వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా తమ సత్తా చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో తాను కూడా ఎన్ ఎస్ ఎస్ విద్యార్థినేనని తెలిపారు. దీని ద్వారానే ఉన్నత చదువుల్లో రాణించానని, ఉద్యోగంలో కూడా ఎన్ఎస్ఎస్ భావజాలంతో పని చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవి నారాయణ, వైస్ చైర్మన్ చోప్పా ఎల్లారెడ్డి, పులివెందుల జె ఎన్ టి యు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శేష మహేశ్వరమ్మ, ఏఐటిఎస్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఓబుల పతి తదితరులు పాల్గొన్నారు.


Body:వైభవంగా ఎన్ ఎస్ ఎస్ యువజనోత్సవాలు


Conclusion:ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.