ETV Bharat / state

గళమెత్తిన ఖాళీ బిందెలు - మైదుకూరులో నీటి కోసం మహిళల నిరసన

కడప జిల్లా మైదుకూరులో మహిళలు నీటి కోసం నిరసన చేపట్టారు. స్థానిక అన్న క్యాంటీన్​ భవనం వద్ద బోరు చేడిపోవడంతో ఖాళీ బిందులతో ధర్నా చేశారు.

maidhukuru women protest for water
మైదుకూరులో నీటి కోసం మహిళల నిరసన
author img

By

Published : Apr 28, 2020, 9:36 AM IST

అటు కేసీ కాలువ.. ఇటు తెలుగుగంగ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రాయలసీమ కూడలి పట్టణం- మైదుకూరు మాత్రం నీటి కష్టాలతో విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో ఇక్కట్లు ముంచుకొస్తున్నాయి. స్థానిక అన్న క్యాంటీన్‌ భవనం వద్ద బోరు చెడిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారు ఇక్కట్లే ఎదుర్కొంటున్నారు. బోరుకు మరమ్మతు చేసి సమస్య పరిష్కరించాలని అక్కడి మహిళలు సోమవారం నిరసన బాట పట్టారు. ఖాళీ బిందెలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పంచాయతీ రాజ్‌ ఏఈ మధుసూదన్‌బాబు స్పందిస్తూ వెంటనే మరమ్మతు చేయిస్తామని హామీనిచ్చారు.

అటు కేసీ కాలువ.. ఇటు తెలుగుగంగ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రాయలసీమ కూడలి పట్టణం- మైదుకూరు మాత్రం నీటి కష్టాలతో విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో ఇక్కట్లు ముంచుకొస్తున్నాయి. స్థానిక అన్న క్యాంటీన్‌ భవనం వద్ద బోరు చెడిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారు ఇక్కట్లే ఎదుర్కొంటున్నారు. బోరుకు మరమ్మతు చేసి సమస్య పరిష్కరించాలని అక్కడి మహిళలు సోమవారం నిరసన బాట పట్టారు. ఖాళీ బిందెలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పంచాయతీ రాజ్‌ ఏఈ మధుసూదన్‌బాబు స్పందిస్తూ వెంటనే మరమ్మతు చేయిస్తామని హామీనిచ్చారు.

ఇదీ చదవండి.. ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.