రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందని మాజీమంత్రి, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు. వాటి ద్వారా మారుమూల గ్రామపంచాయతీలు సైతం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అలాంటి కీలకమైన ఎన్నికలను కరోన వైరస్ కారణం చూపుతూ వాయిదా వేయడం సబబు కాదన్నారు. దీని వల్ల రాష్ట్రానికి అందాల్సిన సుమారు ఐదు వేల కోట్లు రూపాయల నిధులు అందకుండా పోతాయని వాపోయారు.
ఇవీ చూడండి...