ఎంతో చరిత్ర కలిగిన ఎం.ఆర్ కాలేజీని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని జనసే పార్టీ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ పాలవలస యశస్వి తీవ్రంగా ఖండించారు. విజయనగరంలో మాట్లాడిన ఆమె.... ఎన్నో ఎళ్ల చరిత్ర కలిగిన కళాశాలపై వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మంది పేదలకు ఆసరాగా ఉన్న కళాశాలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుతో కళాశాలలో పని చేసే ఉపాధ్యాయులు రోడ్లపై బిక్షాటన చేసే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జనసేన పార్టీ తరపున ఎన్ని పోరాటాలైనా చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి