విజయనగరం జిల్లా పార్వతీపురంలో వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి కాస్త మబ్బులతో ఉన్న వాతావరణం మరింత చల్లబడి 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీనికి తోడు వడగళ్ళు పడడంతో వాతావరణం చల్లబడింది. రెండు వారాలుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ఎండవేడికి జనం అల్లాడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో వరుణ దేవుడు కరుణించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు గాలితో ప్రారంభమైన చినుకులు జోరందుకున్నాయి. వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
ఇవీ చదవండి