ETV Bharat / state

మన్యంలో విషాదం.. ప్రసవంలోనే మరణం! - పాడేరు

మన్యంలో మరో విషాదం. సౌకర్యాల లేమి కారణంగా.. అడవి బిడ్డలు ఎంతటి ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండకపోవచ్చు. నిండు గర్భిణి.. వైద్యం కోసం.. 1 కాదు.. 2 కాదు.. ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అలా నడిచీ.. నడిచీ.. ఈ లోకంలో బతకలేక కుప్పకూలింది. తనతో పాటు.. గర్భంలోని బిడ్డనూ అనంతలోకాలకు వెంట తీసుకెళ్లింది. ఇంతటి హృదయవిదారక ఘటనకు.. జమదంగి కొండలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి.

మన్యంలో రోడ్డు లేక..మళ్లీ డోలి కట్టారు..తర్వాత!
author img

By

Published : Aug 25, 2019, 12:05 PM IST

Updated : Aug 25, 2019, 3:57 PM IST

విశాఖ పాడేరు ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు పెదబయలు మండలం జమదంగి గిరుల్లో నివసించే మన్యం బిడ్డలు.. వైద్యం కావాలంటే బోయితలి ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిందే. సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న ఆ ప్రాంతానికి.. లక్ష్మి అనే గర్భిణిని ఆమె కుటుంబీకులు నడిపించి తీసుకెళ్లారు. అంతా కొండ మార్గమే. ఎగుడు దిగుడు దారుల్లో ఆ ప్రయాణం అడుగడుగూ నరకప్రాయమే. అయినా.. కడుపులో ఉన్న బిడ్డ కోసం లక్ష్మి కష్టానికి ఓర్చుకుంది. బోయితలికి వెళ్లి ఆర్ఎంపీ వైద్యుడికి చూపించుకుని.. తిరిగి అదే రీతిలో ఇంటికి బయల్దేరింది. ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆమెకు పురుటి నొప్పులు పెరిగాయి. భరించలేకపోయింది. చేసేదిలేక.. డోలి కట్టి లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లారు.. కుటుంబీకులు. అప్పటికే పరిస్థితి విషమించింది. లక్ష్మి ప్రసవించింది. తీవ్ర రక్తస్రావమైంది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు.. తల్లి కూడా ప్రాణం విడిచింది. ఉపాధ్యాయుడు దాసు బాబు.. వారాంతంలో పాడేరుకు వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్షి, ఆమె బిడ్డల మరణ వార్త.. మన్యం దాటి బయటికి వచ్చేందుకు 5 రోజులు పట్టింది.

పాపం ఇమాన్యుయేల్!
మన్యంలో సరైన వైద్యం అందక ప్రాణం విడిచిన లక్ష్మికి.. ఇంతకుముందే ఓ కుమారుడు ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. ఇటీవల తన ప్రతిభతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ పిల్లాడే ఇమాన్యుయేల్. తల్లి మరణం.. ఆ బాబును విషాదంలో ముంచింది. అసలు తన తల్లి ఎలా మృతి చెందిందో అర్థం చేసుకోలేని ఆ పసి హృదయం పడుతున్న ఆవేదనకు.. అంతా తల్లడిల్లిపోతున్నారు.

మన్యంలో రోడ్డు లేక..మళ్లీ డోలి కట్టారు..తర్వాత!

ఇదీ చదవండి: గర్భిణీకి డోలీ కష్టాలు.... 5 కిలోమీటర్ల పయనం...

విశాఖ పాడేరు ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు పెదబయలు మండలం జమదంగి గిరుల్లో నివసించే మన్యం బిడ్డలు.. వైద్యం కావాలంటే బోయితలి ప్రాంతానికి నడిచి వెళ్లాల్సిందే. సుమారు 20 కిలోమీటర్లు దూరం ఉన్న ఆ ప్రాంతానికి.. లక్ష్మి అనే గర్భిణిని ఆమె కుటుంబీకులు నడిపించి తీసుకెళ్లారు. అంతా కొండ మార్గమే. ఎగుడు దిగుడు దారుల్లో ఆ ప్రయాణం అడుగడుగూ నరకప్రాయమే. అయినా.. కడుపులో ఉన్న బిడ్డ కోసం లక్ష్మి కష్టానికి ఓర్చుకుంది. బోయితలికి వెళ్లి ఆర్ఎంపీ వైద్యుడికి చూపించుకుని.. తిరిగి అదే రీతిలో ఇంటికి బయల్దేరింది. ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆమెకు పురుటి నొప్పులు పెరిగాయి. భరించలేకపోయింది. చేసేదిలేక.. డోలి కట్టి లక్ష్మిని ఇంటికి తీసుకెళ్లారు.. కుటుంబీకులు. అప్పటికే పరిస్థితి విషమించింది. లక్ష్మి ప్రసవించింది. తీవ్ర రక్తస్రావమైంది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు.. తల్లి కూడా ప్రాణం విడిచింది. ఉపాధ్యాయుడు దాసు బాబు.. వారాంతంలో పాడేరుకు వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్షి, ఆమె బిడ్డల మరణ వార్త.. మన్యం దాటి బయటికి వచ్చేందుకు 5 రోజులు పట్టింది.

పాపం ఇమాన్యుయేల్!
మన్యంలో సరైన వైద్యం అందక ప్రాణం విడిచిన లక్ష్మికి.. ఇంతకుముందే ఓ కుమారుడు ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. ఇటీవల తన ప్రతిభతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ పిల్లాడే ఇమాన్యుయేల్. తల్లి మరణం.. ఆ బాబును విషాదంలో ముంచింది. అసలు తన తల్లి ఎలా మృతి చెందిందో అర్థం చేసుకోలేని ఆ పసి హృదయం పడుతున్న ఆవేదనకు.. అంతా తల్లడిల్లిపోతున్నారు.

మన్యంలో రోడ్డు లేక..మళ్లీ డోలి కట్టారు..తర్వాత!

ఇదీ చదవండి: గర్భిణీకి డోలీ కష్టాలు.... 5 కిలోమీటర్ల పయనం...

test file from feedroom
Last Updated : Aug 25, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.