విశాఖ మన్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఘంటారావం మోగడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మన్యంలోని అరకులోయ మండలంలో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రత చర్యలు చేపట్టారు. నామ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ రావు చర్యలు తీసుకున్నారు.