మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగి సత్వరమే వైద్య పరీక్షలు చేసుకోవాలని విశాఖ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి అన్నారు. నగరంలోని హెల్త్ కేర్ గ్లోబల్ కేంద్రంలో రూ.365తో మెమ్మోగ్రామ్ ప్యాకేజీని ప్రారంభించారు. చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్పై అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పారు. రూ. 365కే పరీక్షలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మిస్ వైజాగ్ ఫైనల్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏయూ విద్యార్థుల ఆందోళన