రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021... జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.
నూతన చట్టం ప్రకారం విధించే జరిమానాలు...
- హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. రెండోసారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు.
- చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా.
- అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.
- రెడ్ సిగ్నల్ పడిన తరువాత నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.
- మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా.
- వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా.
- పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్కు రూ.20,000 జరిమానా.
- పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.
- అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా.
ఇదీచదవండి.