మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామం కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 13న అధిక వర్షాలతో గ్రామ సమీపంలో ఉన్న కాలువలో భారీగా వరద నీటి ప్రవాహం వచ్చింది. ఈ వరదలో గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి పలాస అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్డీఆర్ఎస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం అతని మృతదేహాం లభ్యమైంది.
ఇదీ చదవండి :