ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో... తొలి రోజు 158 మంది ఉపసంహరణ - municipal nomination withdrawal at nelore

నెల్లూరు జిల్లాలో మంగళవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ఆరంభంతో పుర ఎన్నికల వేడి మొదలైంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్లీ ప్రారంభించారు. భద్రపరిచిన నామపత్రాలను బందోబస్తు నడుమ బయటికి తీశారు. తొలిరోజు నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 158 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

nominations withdraw in Nellore district
nominations withdraw in Nellore district
author img

By

Published : Mar 3, 2021, 9:04 AM IST

ఏడాది కిందట వాయిదా పడిన పురపోరును అధికారులు మంగళవారం ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆపేసిన ప్రక్రియను... తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల పరిధిలో 98 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా- వీటిలో పోటీకి 568 మంది నామినేషన్లు వేశారు. అధికారులు వాటిలో 25 తిరస్కరించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియకు బుధవారం మధ్యాహ్నం 3 వరకు సమయం ఉంది. తొలిరోజు నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 158 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు 121 మంది నామినేషన్లు వేయగా.. తొలి రోజు 43 మంది ఉపసంహరించుకున్నారు. 3, 5, 22 వార్డుల్లో ఒక్కటి చొప్పున మాత్రమే దాఖలైంది. వారంతా వైకాపా మద్దతుదారులే. నాయుడుపేటలో 25 వార్డులకు దాఖలైన 160 నామినేషన్లలో 81 ఉపసంహరించుకున్నారు. ఫలితంగా 3, 4, 5, 7, 12, 13, 19 వార్డుల్లో ఒక్కటి మాత్రమే నమోదైంది. వెంకటగిరిలో 25 వార్డులకు పోటీ పడుతున్న 158 మందిలో 19 మంది నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు.

ఇక్కడ 20వ వార్డుకు గత ఏడాదే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. ఆత్మకూరులో 23 వార్డులకు 114 మంది నామినేషన్‌ వేయగా.. 15 మంది వెనక్కు తీసుకున్నారు. నేటి మధ్యాహ్నం ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు. వారికి గుర్తులు కూడా అదే రోజు కేటాయిస్తారు. ఈ నెల 10న ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీపోలింగ్‌ అవసరమైతే 13న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 14న చేపడతారు.

ఏడాది కిందట వాయిదా పడిన పురపోరును అధికారులు మంగళవారం ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆపేసిన ప్రక్రియను... తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు పురపాలక సంఘాల పరిధిలో 98 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా- వీటిలో పోటీకి 568 మంది నామినేషన్లు వేశారు. అధికారులు వాటిలో 25 తిరస్కరించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియకు బుధవారం మధ్యాహ్నం 3 వరకు సమయం ఉంది. తొలిరోజు నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 158 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా పది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు 121 మంది నామినేషన్లు వేయగా.. తొలి రోజు 43 మంది ఉపసంహరించుకున్నారు. 3, 5, 22 వార్డుల్లో ఒక్కటి చొప్పున మాత్రమే దాఖలైంది. వారంతా వైకాపా మద్దతుదారులే. నాయుడుపేటలో 25 వార్డులకు దాఖలైన 160 నామినేషన్లలో 81 ఉపసంహరించుకున్నారు. ఫలితంగా 3, 4, 5, 7, 12, 13, 19 వార్డుల్లో ఒక్కటి మాత్రమే నమోదైంది. వెంకటగిరిలో 25 వార్డులకు పోటీ పడుతున్న 158 మందిలో 19 మంది నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు.

ఇక్కడ 20వ వార్డుకు గత ఏడాదే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. ఆత్మకూరులో 23 వార్డులకు 114 మంది నామినేషన్‌ వేయగా.. 15 మంది వెనక్కు తీసుకున్నారు. నేటి మధ్యాహ్నం ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు. వారికి గుర్తులు కూడా అదే రోజు కేటాయిస్తారు. ఈ నెల 10న ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీపోలింగ్‌ అవసరమైతే 13న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు 14న చేపడతారు.

ఇదీ చదవండి:

హోరెత్తిన పురపోరు.. ప్రచార బరిలో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.