నెల్లూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మంగుంటలో తాతి రెడ్డి వంశస్థులు తమ కులదైవం నరసింహ స్వామికి ప్రతీకగా ఎద్దును పూజిస్తారు. స్వామి అనుగ్రహంతో పుట్టిన ఇలవేల్పుగా గత ఏడేళ్లుగా కొలుస్తున్న ఎద్దు అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న తాతిరెడ్డి వంశస్థలు ఎద్దుకు పూజలు నిర్వహించారు. మేళతాళాలలు, పిల్లనగ్రోవి వాయిద్యాల నడుమ ఎద్దుకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఎద్దుకు వీడ్కొలు పలికారు.
ఇవీ చదవండి: పల్టీ కొట్టిన పైసల బండి..