కర్నూలు జిల్లా నంద్యాల ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో 1986-90 సంవత్సరం ఈసీఈ డిప్లొమా బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను సన్మానించారు. వచ్చే ఏడాది నుంచి బ్యాచ్లో టాపర్గా నిలిచిన విద్యార్థికి నగదును అందజేయాలని నిర్ణయించారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు కళాశాల భవన మరమ్మతులకు తమ వంతు సహకరిస్తామన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన తమ తోటి విద్యార్థి గురునాథ రెడ్డికి నివాళులర్పించారు.
ఇదీ చూడండి: నరేంద్రపురంలో ఉన్నత పాఠశాలలో అ 'పూర్వ' సమ్మేళనం