ETV Bharat / state

చివరి రోజున భారీగా నామినేషన్లు - bjp

నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నేతల వెంట కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

నామినేషన్లు
author img

By

Published : Mar 25, 2019, 7:55 PM IST

ముగిసిన నామినేషన్ల సంబరం
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బి. రామాంజనేయులు నామినేషన్ కోలాహలంగా సాగింది. గూడూరు రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్​ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్పలు హాజరయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శన చేపట్టారు.

జిల్లాలోని మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి భాజపా,జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భాజపాఅభ్యర్థి జెల్లీ మధుసూదన్ మాధవరం రహదారి నుంచి ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట సినీ నటి, భాజపా నాయకురాలు కవిత హాజరయ్యారు. అలాగే జనసేన అభ్యర్థి బోయ లక్ష్మన్న, పిరమిడ్ పార్టీ అభ్యర్థి హేమంత్ నామినేషన్లు వేశారు.

కర్నూలు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్​ ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నగరంలోని జమ్మీ చెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డితో పాటు వైకాపా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డోన్ సీపీఐ అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ నుండి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.డోన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సందు వెంకటరమణ నామినేషన్ సమర్పించారు. పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయం చేరుకొని ఆర్​వో వెంకటేశ్వర్లుకు నామినేషన్ పత్రాలను అందించారు.

ముగిసిన నామినేషన్ల సంబరం
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బి. రామాంజనేయులు నామినేషన్ కోలాహలంగా సాగింది. గూడూరు రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్​ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్పలు హాజరయ్యారు. కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శన చేపట్టారు.

జిల్లాలోని మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి భాజపా,జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భాజపాఅభ్యర్థి జెల్లీ మధుసూదన్ మాధవరం రహదారి నుంచి ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట సినీ నటి, భాజపా నాయకురాలు కవిత హాజరయ్యారు. అలాగే జనసేన అభ్యర్థి బోయ లక్ష్మన్న, పిరమిడ్ పార్టీ అభ్యర్థి హేమంత్ నామినేషన్లు వేశారు.

కర్నూలు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్​ ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నగరంలోని జమ్మీ చెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డితో పాటు వైకాపా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డోన్ సీపీఐ అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ నుండి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.డోన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సందు వెంకటరమణ నామినేషన్ సమర్పించారు. పట్టణంలోని ఎన్నికల అధికారి కార్యాలయం చేరుకొని ఆర్​వో వెంకటేశ్వర్లుకు నామినేషన్ పత్రాలను అందించారు.

Hyderabad, Mar 25 (ANI): All India Majlis-e-Ittehad-ul-Muslimeen (AIMIM) leader Akbaruddin Owaisi mocked Prime Minister Narendra Modi for his 'Mai Bhi Chowkidar' electoral campaign ahead of the upcoming Lok Sabha elections on Sunday. While addressing an election campaign in Hyderabad, Owaisi said, "I've seen on Twitter 'Chowkidar Narendra Modi', 'Chowkidar Amit Shah' every BJP leader has added Chowkidar. But then why just on Twitter, he should also mention 'Chowkidar' in his Aadhaar card and passport. We want a PM not a 'Chaiwala', 'Pakodewala'. If Modi is interested, he should come to me, I'll offer him a Chowkidar's cap and a whistle."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.