కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో తమ సాగుభూమిని అధికారులు అన్యాయంగా లాక్కున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పేదల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా... రామంజి అనే రైతుకు చెందిన పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఏమీ ఇవ్వకపోవటం వల్ల ఆవేదనతో పురుగులమందు తాగాడు. పరిస్థితి విషమించగా.. చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను అడిగితే విసిగిస్తున్నారని.... అందుకే పురుగులమందు తాగాడని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: