కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించారు. అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. వంటశాల, ఇతర సమస్యలు, మినరల్ వాటర్ ప్లాంట్, తరగతి గదుల్లో బెంచీలు, వసతి గృహాల్లో మంచాల కొరత ఉందని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిస్కారానికి కృషి చేస్తామని వాసిరెడ్డి పద్మ హామీఇచ్చారు. విద్యార్థినులు పాటించాల్సిన క్రమశిక్షణ, అంకిత భావం గురించి స్ఫూర్తిదాయక విషయాలు పంచుకున్నారు.
ఇదీ చదవండి