ETV Bharat / state

దొంగ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా అరెస్ట్ - విజయవాడలో దొంగ నోట్ల మార్పిడి

దొంగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను విజయవాడ భవానీపురం స్థానికులు పోలీసులకు అప్పగించారు. బడ్డీ కొట్టు నడుపుతున్న మహిళ వద్ద నకిలీ 500 నోటు మార్పిడి చేసిన కేటుకాళ్లు.. అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడి స్థానికుల సహాయంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.

fake currency seized
పట్టుబడిన దొంగనోట్లు
author img

By

Published : Aug 28, 2020, 12:15 PM IST

విజయవాడ భవానీపురంలో కొందరు వ్యక్తులు ఓ బడ్డీ కొట్టుకు వెళ్లి సరకులు తీసుకున్నారు. ఆమెకు ఐదు వందల రూపాయల నోట్ ఇచ్చి చిల్లర తీసుకెళ్లిపోయారు. ఆ నోటు తేడాగా ఉందన్న విషయాన్ని బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న విజయలక్ష్మీ గ్రహించి తెలిసిన వారికి చూపించింది. వారి సహాయంతో పోలీసులకు విషయం చేరవేస్తే అసలు గుట్టు బయటపడింది.

ఆ నోటు ఇచ్చిన ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. నింధితులను నుండి 3,500 నకిలీ నోట్లు, దొంగ నోట్లు ముద్రిస్తున్న జిరాక్స్ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని భవానీపురం పీఎస్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు.

విజయవాడ భవానీపురంలో కొందరు వ్యక్తులు ఓ బడ్డీ కొట్టుకు వెళ్లి సరకులు తీసుకున్నారు. ఆమెకు ఐదు వందల రూపాయల నోట్ ఇచ్చి చిల్లర తీసుకెళ్లిపోయారు. ఆ నోటు తేడాగా ఉందన్న విషయాన్ని బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న విజయలక్ష్మీ గ్రహించి తెలిసిన వారికి చూపించింది. వారి సహాయంతో పోలీసులకు విషయం చేరవేస్తే అసలు గుట్టు బయటపడింది.

ఆ నోటు ఇచ్చిన ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. నింధితులను నుండి 3,500 నకిలీ నోట్లు, దొంగ నోట్లు ముద్రిస్తున్న జిరాక్స్ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని భవానీపురం పీఎస్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: జనం సొమ్ముతో... ఎంత కాలమిలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.