ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మాజీ ఉపసభాపతి

author img

By

Published : Dec 4, 2020, 3:34 PM IST

నివర్ తుపాను ధాటికి దెబ్బతిన్న పంటలను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మెరకనపల్లి, టేకుపల్లి, వెంకటాపురం, పెదకళ్లేపల్లిలో పర్యటించి.. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

mandali tour in mopidevi
దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మండలి బుద్ధ ప్రసాద్

కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మెరకనపల్లి, టేకుపల్లి, వెంకటాపురం, పెదకళ్లేపల్లి గ్రామాల్లో.. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులతో కలిసి.. వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు.

నివర్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు.. ఉపసభాపతికి వివరించారు. కొన్నిచోట్ల ధాన్యం తడిచిపోయి.. రంగుమారిందని అన్నదాతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి డిమాండ్ చేశారు. అన్ని విషయాల్లో కర్షకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని మెరకనపల్లి, టేకుపల్లి, వెంకటాపురం, పెదకళ్లేపల్లి గ్రామాల్లో.. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. ఆయా గ్రామాల తెదేపా నాయకులతో కలిసి.. వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు.

నివర్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు.. ఉపసభాపతికి వివరించారు. కొన్నిచోట్ల ధాన్యం తడిచిపోయి.. రంగుమారిందని అన్నదాతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉపసభాపతి డిమాండ్ చేశారు. అన్ని విషయాల్లో కర్షకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.