కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రెడ్ జోన్ ఏరియాలో అడిషనల్ ఎస్పీ సత్తిబాబు పర్యటించారు. నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాలు, నిత్యావసర వస్తువుల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభానును కలిసి లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు తీరుతెన్నులు గురించి చర్చించారు. ఆదివారం నుంచి పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించారు. పౌరులు భౌతిక దూరాన్ని పాటిస్తూ తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రెడ్ జోన్ ప్రాంతాల వారికి వస్తువులు కూరగాయలు డోర్ డెలివరీ అయ్యేలా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి: