కృష్ణాజిల్లా నందిగామలో చోరీ జరిగింది. ఓ వ్యక్తి తన సొంత పనుల నిమిత్తం గ్రామీణ సిండికేటు బ్యాంకులో గోల్డ్ లోన్ తాకట్టు పెట్టి... 3లక్షల 7వేల రూపాయలు తీసుకున్నాడు. నగదును తన ద్విచక్రవాహనంలో పెట్టి పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి రాగానే....గుర్తు తెలియని వ్యక్తులు సొమ్మును దొంగలించారు. ఘటనపై బాధితుడు పెట్యాల రాజేష్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి