YCP leader Venu Gopal Reddy joined TDP: వైకాపా గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలందరూ.. నేడు ఎందుకు జగన్ని గెలిపించుకున్నామని బాధపడుతున్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి మండల వైకాపా నేత వేణుగోపాల్రెడ్డితో పాటు అతని అనుచరులు లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరిలో ఓడిపోయినా ఇక్కడి ప్రజలతోనే ఉన్నానని అన్నారు. అలాగే దారి తప్పుతున్న రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతామని.. దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు మాతో చేతులు కలపండని లోకేశ్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: