ETV Bharat / state

గుంటూరు జిల్లాలో అరుదైన పక్షి పిల్లలు - Guntur district latest news

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ఓ అపార్ట్​మెంట్​లో అరుదైన జాతికి చెందిన పక్షి పిల్లలు కనిపించాయి. ఎవరైనా వాటి దగ్గరకు వెళితే అవి బుసకొడుతున్నాయి.

Rare bird babies have been spotted in Guntur district
Rare bird babies have been spotted in Guntur district
author img

By

Published : Dec 23, 2020, 9:46 AM IST

గుంటూరు జిల్లాలో అరుదైన పక్షి పిల్లలు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అరుదైన ఆరు పక్షి పిల్లలు కనిపించాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని గదిలో కప్ బోర్డులో దాక్కుని ఉన్న వీటిని యజమాని గుర్తించి సంరక్షించారు.

తెల్లని రంగుతో పెద్ద కళ్లు, పొడవాటి ముక్కుతో ఉన్నాయి. గింజలు వేసినా తినడం లేదు. రాత్రి సమయాల్లో తల్లి పక్షి వచ్చి పోతున్నట్లు తెలిసింది. చనిపోయిన ఎలుకను తల్లి పక్షి వదిలివెళ్లటంతో దానిని తింటున్నాయి. ఎవరైనా దగ్గరకు వెళితే బుసకొడుతున్నాయి. ఇవి అరుదైన మాస్క్​డ్ గుడ్లగూబ జాతికి చెందిన పక్షులుగా స్థానికులు భావిస్తున్నారు. అటవీ అధికారులు వీటిని తీసుకెళ్లి సంరక్షించాలని భవన యజమాని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఎస్సై తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం

గుంటూరు జిల్లాలో అరుదైన పక్షి పిల్లలు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అరుదైన ఆరు పక్షి పిల్లలు కనిపించాయి. నిర్మాణంలో ఉన్న భవనంలోని గదిలో కప్ బోర్డులో దాక్కుని ఉన్న వీటిని యజమాని గుర్తించి సంరక్షించారు.

తెల్లని రంగుతో పెద్ద కళ్లు, పొడవాటి ముక్కుతో ఉన్నాయి. గింజలు వేసినా తినడం లేదు. రాత్రి సమయాల్లో తల్లి పక్షి వచ్చి పోతున్నట్లు తెలిసింది. చనిపోయిన ఎలుకను తల్లి పక్షి వదిలివెళ్లటంతో దానిని తింటున్నాయి. ఎవరైనా దగ్గరకు వెళితే బుసకొడుతున్నాయి. ఇవి అరుదైన మాస్క్​డ్ గుడ్లగూబ జాతికి చెందిన పక్షులుగా స్థానికులు భావిస్తున్నారు. అటవీ అధికారులు వీటిని తీసుకెళ్లి సంరక్షించాలని భవన యజమాని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఎస్సై తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.