వచ్చే ఐదేళ్లలో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. అల్లా దయతో మరో 2 రోజుల్లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు లోకేశ్ హాజరయ్యారు. ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ...లవకుశ సినిమాలో ఆ పాత్రలు పోషించిన కుశుడు, నాగరాజులను మంత్రి లోకేశ్ ఘనంగా సత్కరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మండుటెండలను లెక్క చేయకుండా కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు అల్లా శక్తినివ్వాలని ఆకాంక్షించారు.
ఇవి చదవండి...లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు: ద్వివేది