గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య అందరినీ తీవ్రంగా కలిచివేసిందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అనూష భౌతికకాయన్ని గురువారం సందర్శించారు. దిశ చట్టం ప్రకారం ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థిని కుటుంబానికి సత్వర న్యాయం జరగేలా చూస్తామన్నారు. పాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కఠిన శిక్షలుండేలా దిశ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: తెదేపా కార్యకర్తలపై దాడులు దారుణం.. కోర్టుకెళ్తాం: నారా లోకేశ్