ETV Bharat / state

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... గ్రామస్థుల ఆందోళన

author img

By

Published : Jul 7, 2021, 9:37 PM IST

తూర్పుగోదావరి జిల్లా గవరయ్య కోనేరు జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్​ కోసం వేచి ఉన్న వారిపై ఆటో దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అప్రోచ్ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Concern of villagers
గ్రామస్థుల ఆందోళన

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు జాతీయ రహదారిపై పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బస్ కోసం వేచి ఉన్న వారి పైకి ఆటో దూసుకు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

ఆగ్రహించిన మర్లపాడు, చేపురు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. అప్రోచ్ రోడ్డులు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచి పోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చ జెప్పటంతో ఆందోళన విరమించారు.

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు జాతీయ రహదారిపై పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బస్ కోసం వేచి ఉన్న వారి పైకి ఆటో దూసుకు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

ఆగ్రహించిన మర్లపాడు, చేపురు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. అప్రోచ్ రోడ్డులు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచి పోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చ జెప్పటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

Lokesh: రైతులతో చర్చించండి.. పంట విరామ ప్రకటనను విరమింపజేయండి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.