'18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్' - '18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్'
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 18 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని.. వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఓ కారు, 6 బైకులు, 18 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భీమారావు తెలిపారు.