తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి వీఆర్వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ రైతు నుంచి 5 వేల రూపాయలు తీసుకుంటుండగా అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం గ్రామానికి చెందిన వీర నాగ బాబు అనే రైతు 7 ఎకరాల భూమిని ఆన్లైన్ చేసేందుకుగాను... వీఆర్వో దేవత లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు విషయాన్ని అనిశా అధికారులకు తెలియజేశారు. రాజమహేంద్రవరం అనిశఆ సిబ్బంది.. రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. నిందితురాలిని రాజమహేంద్రవరం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: