రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో వ్యవసాయ రంగం అన్యాయానికి గురవుతోందని, రాష్ట్రంలో 50 శాతం వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నా, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ఈ క్రాప్ విధానంతో వైకాపా దళారీలకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని ఆరోపించారు. వైఎస్సార్ జలకళతో రెండు లక్షల బోర్లు తవ్విస్తామని చెబుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు ఎన్ని బోర్లు తవ్వించారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్.మనోహర్నాయుడు, తెలుగు రైతు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు నాగేశ్వర్రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Roja Played Kabaddi: తిరుపతిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా