ETV Bharat / state

సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం: ద్వివేది - dwivedi

సార్వత్రిక సమరానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో బయటివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది
author img

By

Published : Apr 9, 2019, 7:43 PM IST

Updated : Apr 10, 2019, 6:56 AM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది

అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇవాళ, రేపు కోడ్ అమలులో ఉంటుందన్నారు. నియోజకవర్గాల్లో బయటివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.తనీఖీల్లో ఇప్పటివరకు 196.03 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. సీ-విజిల్ యాప్లో 5,679 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ఎక్కువగా తప్పుడు కేసులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా పెండింగ్ 26 కేసులు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏజెంట్లుగా వ్యవహరించేవారు ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. పోలింగ్ సన్నాహకాలు గంటముందే ప్రారంభమవుతాయన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే... ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది

అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే. ద్వివేది మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇవాళ, రేపు కోడ్ అమలులో ఉంటుందన్నారు. నియోజకవర్గాల్లో బయటివారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.తనీఖీల్లో ఇప్పటివరకు 196.03 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. సీ-విజిల్ యాప్లో 5,679 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ఎక్కువగా తప్పుడు కేసులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా పెండింగ్ 26 కేసులు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏజెంట్లుగా వ్యవహరించేవారు ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు. పోలింగ్ సన్నాహకాలు గంటముందే ప్రారంభమవుతాయన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉంచామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే... ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి

సమరాంధ్ర 2019.. ప్రచారం ముగిసింది.. ఎన్నికే మిగిలింది!

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో నగరి తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చెర్లో పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లో తెదేపా అధికారంలోకి వస్తే మరో ఐదు పాలు పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు రూపాయలు యాభై వేలు అందించడం జరుగుతుందని తెలిపారు 200 పింఛను 2000 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దక్కుతుందని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ చైర్మన్ యుగంధర్ వైస్ చైర్మన్ ఆనంద్ తెదేపా నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు


Body:nagari


Conclusion:8008574570
Last Updated : Apr 10, 2019, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.