అనంతపురం జిల్లా రొద్దం మండలంలో శ్రీ రామ భక్త మండలి ఆధ్వర్యంలో పలువురు భక్తులు పాదయాత్ర చేపట్టారు. రొద్దం నుంచి కర్ణాటకలోని పావుగడ శనీశ్వరుని దేవాలయానికి కాలినడకన బయల్దేరారు. సీతారాములు, ఆంజనేయస్వామి చిత్రపటాలను చేతపట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో పాదయాత్ర చేశారు. 15 కిలోమీటర్లు నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. శనీశ్వరుడు ధను రాశి నుంచి మకర రాశిలో అడుగుపెడుతున్న సందర్భంగా రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు భక్తులను కాపాడాలని కోరుతూ.. మొక్కులు చెల్లించుకున్నామని రామ భక్త మండలి సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆవుకు సమాధి... 22 ఏళ్లుగా పూజలు!