ETV Bharat / state

నీటిగుంతలో పడి చిన్నారి మృతి - నీటిగుంతలో పడి చిన్నారి మృతి

అనంతపురం జిల్లా బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి చిన్నారి మృతి చెందింది. బట్టలు ఉతకడానికి తల్లితో కలిసి నీటి గుంత వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలొదిలింది.

నీటిగుంతలో పడి చిన్నారి మృతి
నీటిగుంతలో పడి చిన్నారి మృతి
author img

By

Published : Jun 19, 2020, 9:24 AM IST

ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామక్క అనే మహిళ తన కూతురు మళ్లీశ్వరిని తీసుకొని బట్టలు ఉతకడానికి సమీపంలోని నీటి గుంతవద్దకు వెళ్లింది. అక్కడే ప్రమాదవశాత్తు మల్లీశ్వరి నీటి గుంతలో పడి చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామక్క అనే మహిళ తన కూతురు మళ్లీశ్వరిని తీసుకొని బట్టలు ఉతకడానికి సమీపంలోని నీటి గుంతవద్దకు వెళ్లింది. అక్కడే ప్రమాదవశాత్తు మల్లీశ్వరి నీటి గుంతలో పడి చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.