అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామ శివార్లలో చిరుత దాడి చేసిన సంఘటనలో 54 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన గొర్రెల రైతు గొల్ల శ్రీధర్కు చెందిన వందకు పైగా గొర్రె పిల్లలను గ్రామ శివార్లలో పొలం వద్ద ఓ మందలో ఉంచి పెద్ద గొర్రెల్ని మేత కోసం అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. సాయంకాలం గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.