అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని నాగినాయనచెరువు గ్రామంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా... ఆంజనేయస్వామి ఆలయంలో జ్యోతులు ఉత్సవం నిర్వహించారు. మహిళలు రంగురంగుల పువ్వులతో జ్యోతులను అలంకరించుకొని... తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాస్కులు ధరించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన తరువాత జ్యోతులతో ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: స్నేహం మోహంలో తల్లి... ప్రాణం పోగొట్టుకుంది చిట్టి తల్లి