అనంతపురం జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లిలో బుగ్గబావి అక్కదేవతల కోనేటి వద్ద గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూజారి లక్ష్మీ నరసింహస్వామి, గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వం నుంచి ఇక్కడ అక్కదేవతల కొలను ఉండేదని స్థానికులు తెలిపారు. పులిగుండ్ల పల్లి వాసులతో పాటు ఇతర మండలాల నుంచి భక్తులు ప్రతి శుక్రవారం ఇక్కడకు వచ్చి అక్క దేవతలను కొలిచే వారిని తెలిపారు.
ఇవీ చూడండి...
'నూర్పిడి చేసే స్థోమత లేక వేరుశనగ పంటను దున్నేస్తున్న రైతులు'